TE/690716b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

From Vanipedia

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"సనాతన గోస్వామికి ఆ సమయంలో ఆలయం లేదు; అతను తన దేవతను చెట్టుకు వేలాడదీసాడు. కాబట్టి మదన-మోహన అతనితో మాట్లాడుతూ, 'సనాతన, నువ్వు ఈ ఎండు చపాతీలన్నీ తెస్తున్నావు, అది పాతబడిపోయింది, నువ్వు నాకు కొంచెం ఉప్పు కూడా ఇవ్వవు. నేను ఎలా తినగలను?' సనాతన గోస్వామి, 'అయ్యా, నేను ఎక్కడికి వెళ్లగలను? నాకు ఏది దొరికితే అది మీకు సమర్పిస్తాను. మీరు దయతో అంగీకరించండి. నేను కదలలేను, నేను ముసలివాడిని.' మీరు చూడండి, కాబట్టి కృష్ణుడు దానిని తినవలసి వచ్చింది.భక్తుడు సమర్పిస్తున్నందున, అతను తిరస్కరించలేడు. యే మాం భక్త్యా ప్రయచ్ఛతి. అసలు విషయం భక్తి. మీరు కృష్ణుడికి ఏమి అందించగలరు? అంతా కృష్ణుడికే చెందుతుంది. మీరు ఏమి పొందారు? నీ విలువ ఎంత? మరియు మీ వస్తువుల విలువ ఏమిటి? అది ఏమీ కాదు. కాబట్టి నిజమైన విషయం భక్త్యా; అసలు విషయం మీ భావన. 'కృష్ణా, దయతో తీసుకో. నాకు ఎలాంటి అర్హత లేదు. నేను చాలా కుళ్ళిపోయాను, పడిపోయాను, కానీ (ఏడుస్తూ) నేను ఈ వస్తువును మీ కోసం తీసుకువచ్చాను. దయ చేసి తీసుకోవండి'. ఇది అంగీకరించబడుతుంది. ఉబ్బిపోకండి. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. మీరు కృష్ణుడితో వ్యవహరిస్తున్నారు. అదే నా విన్నపం. చాలా ధన్యవాదాలు... (ఏడ్చాడు)"
690716 - ఉపన్యాసం Festival Installation, Sri Sri Rukmini Dvarakanatha - లాస్ ఏంజిల్స్