TE/700518 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కర్మీలు లేదా జ్ఞానులు లేదా యోగులు, వారు ఎల్లప్పుడూ ... వారు, ప్రతి ఒక్కరూ, ఉద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. మరియు వారి కంటే భక్తులు ఉన్నారు. కాబట్టి భక్తుని స్థానం ఉన్నతమైనది ఎందుకంటే భక్తి ద్వారా మాత్రమే మీరు భగవంతుడుని అర్థం చేసుకోగలరు.భక్త్యా మామ్ అభిజానాతి (భగవద్గీత 18.55), కృష్ణుడు చెప్పాడు. 'కర్మ ద్వారా నన్ను అర్థం చేసుకోగలరు' అని అతను చెప్పలేదు. 'జ్ఞానం ద్వారా ఎవరైనా చేయగలరు' అని ఆయన చెప్పలేదు. 'యోగం ద్వారా నన్ను అర్థం చేసుకోగలరు' అని ఆయన చెప్పలేదు.. స్పష్టంగా చెప్పారు. భక్త్యా మామ్ అభిజానాతి: 'కేవలం భక్తి సేవ ద్వారా అర్థం చేసుకోవచ్చు'. యావాన్ యస్ చస్మి తత్త్వతః (భగవద్గీత 18.55). ఆయనను ఆయనగా తెలుసుకోవడమే భక్తి. కాబట్టి భక్తితో తప్ప పరమ సత్యాన్ని అర్థం చేసుకునే అవకాశం లేదు."
700518 - ఉపన్యాసం ISO 13-15 - లాస్ ఏంజిల్స్