TE/Prabhupada 0315 - మనము మొండిగా ఉన్నాము, కృష్ణుడిని మరలా మరచిపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇది జరుగుతుంది



City Hall Lecture -- Durban, October 7, 1975


లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ గొప్ప ఉద్యమంలో మీరు దయతో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ ఉద్యమం నేను ప్రారంభించలేదు. ఇది ఎంతో కాలము క్రితమే కృష్ణుడిచే ప్రారంభించబడినది. మొదట, అయిన భగవద్గీత యొక్క ఈ తత్వశాస్త్రాన్ని సూర్యుడితో చెప్పాడు. భగవద్గీత, నాలుగవ అద్యాయములో పేర్కొన్నట్లు,

imam vivasvate yogam
proktavan aham avyayam
vivasvan manave prahur
manur iksvakave 'bravit
(BG 4.1)
evam parampara-praptam
imam rajarsayo viduh
(BG 4.2)

మను వయస్సును లెక్కించినట్లయితే, అది నలభై లక్షల సంవత్సరాలుగా వస్తుంది. కృష్ణుడు చెప్పుతాడు నలభై లక్షల సంవత్సరాల క్రితం, కనీసం, అయిన భగవద్గీత ఈ తత్వమును సూర్య-దేవుడు, వివాశ్వన్ కు చెప్పాడు. సూర్యుని గ్రహాన్ని పాలిస్తున్న దేవుడి నామము వివాస్వాన్. అయిన కుమారుడు, మను, వివస్వాత మను ... అయిన కొడుకు, ఇక్ష్వాకు, సూర్యుని రాజవంశంలో ఉన్న మొదటి వ్యక్తి, దీనిలో భగవంతుడు రామచంద్రుడు దర్శనమిచ్చారు, ఇక్ష్వాకు ... ఈ విధంగా కృష్ణ చైతన్య ఉద్యమము ఎంతో ఎంతోకాలము నుండి వస్తోంది. కానీ కృష్ణుడు చెప్పుతారు, evaṁ paramparā-prāptam imaṁ rājarṣayo viduḥ ( BG 4.2) గతంలో రాజార్షులు, వారు గురువు శిష్య పరంపర ద్వార ఈ ఆదేశాన్ని స్వీకరించారు. ఇది భగవద్గీత అవగాహన చేసుకోనే మార్గం. కానీ కృష్ణుడు అన్నాడు, sa kāleneha yogo naṣṭo parantapa. కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు, కురుక్షేత్ర యుధ్ధంలో అర్జునుడితో మాట్లాడుతునప్పుడు, అయిన పోరాడాలా లేదా పోరాడ కుడదా అని కలవరపడ్డాడు, యుద్ధములో అయినని ఉత్సాహపరచటానికి, అయిన ఐదు సంవత్సరాల క్రితం అర్జునుడికి ఈ భగవద్గీత గురించి చెప్పాడు. అయిన అక్కడ చెప్పాడు "పరంపర పద్ధతి, గురువు శిష్య పరంపర, ఇప్పుడు విచ్ఛిన్నమైంది; అందువలన నేను మీతో మళ్ళీ మాట్లాడుతున్నాను, ఈ తత్వము, కృష్ణ చైతన్యము యొక్క ఆలోచన ఏమిటి అని ప్రజలు మీ నుండి నేర్చుకుoటారు. "

అయిదు వేల సంవత్సరాల క్రితం ఈ తత్వజ్ఞానం అర్జునుడితో చెప్పబడినది, మనము ఉపదేశము కలిగి ఉన్నాము. దురదృష్టవశాత్తూ ఇది మళ్లీ వక్రీకరించబడింది. మనము పరపరా పద్ధతి ద్వారా అందుకోలేదు , మనము మనకు తోచిన విధముగా అవగాహన చేసుకుoటుoన్నాము, అందువల్ల ఇది మళ్ళీ విచ్ఛిన్నమైంది. అందువల్ల, ఐదు వందల సంవత్సరాల క్రితం, శ్రీ చైతన్య మహాప్రభు ఈ భగవద్గీతను భక్తుడిగా ఆదేశించారు. శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణుడిని అవతారముగా ఉండవలసి ఉన్నది. కృష్ణుడు, భగవంతుడు దేవాది దేవుడు, అయిన ఆజ్ఞ ఇచ్చే గురువుగా ఆదేశించాడు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) కానీ ఆప్పటికీ, ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. అందువల్ల ఐదువందల సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు, కృష్ణుడు, కృష్ణుడే భక్తుడిగా ఆవిర్భవించారు. శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణుడు. అది ప్రామాణికమైన శాస్త్రములో వివరించబడింది:

krsna-varnam tvisakrsnam
sangopangastra-parsadam
yajnair sankirtanaih prayair
yajanti hi su-medhasah
(SB 11.5.32)

ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఆచరణాత్మకంగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం. శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణుడే. కృష్ణుడు బద్ధ జీవి మీద చాలా దయ కలిగి ఉన్నాడు. కృష్ణ చైతన్యం యొక్క వాస్తవిక స్థితిలో మళ్ళీ మళ్ళీ వారిని నిలబెట్టడానికి అయిన ప్రయత్నిస్తున్నాడు. కానీ మనము మొండిగా ఉన్నాము, కృష్ణుడిని మరలా మరలా మరచిపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇది జరుగు ఉంది.