TE/Prabhupada 0467 - నేను కృష్ణుడి కమల పాదాల వద్ద ఆశ్రయం తీసుకున్నాను కనుక, నేను సురక్షితంగా ఉన్నాను



Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977


ప్రభుపాద: ప్రహ్లాద మహారాజు,చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ప్రామాణికుడు, ఆయన చాలా వినయపూర్వకమైనవాడు, ఆయన అన్నాడు, kiṁ toṣṭum arhati sa me harir ugra-jāteḥ: నేను చాలా క్రూరమైన కుటుంబంలో జన్మించాను. తప్పని సరిగా నా తండ్రి, నా కుటుంబం, రాక్షసుల కుటుంబం యొక్క లక్షణములు వారసత్వంగా నాకు వచ్చాయి. భగవంతుడు బ్రహ్మ మరియు ఇతర దేవతుల వంటి వ్యక్తులు, వారు భగవంతుని సంతృప్తిపరచలేరు, నేను ఏమి చేస్తాను? " ఒక వైష్ణవుడు ఇలా భావిస్తాడు. వైష్ణవుడు, ప్రహ్లాద మహారాజు, అతడు ఆధ్యాత్మికమైనప్పటికి, నిత్య-సిద్ధ, ఆయన ఆలోచిస్తున్నాడు, తన కుటుంబముతో తనను తాను గుర్తిస్తున్నాడు, ఉదాహరణకు హరిదాస ఠాకూరా లాగానే. హరిదాస్ ఠాకూరా జగన్నాథ ఆలయంలో ప్రవేశించడము లేదు. అదే విషయం, ఐదు వందల సంవత్సరాల క్రితం, వారు జగన్నాథ ఆలయంలో హిందువులను మినహా ఎవరినీ అనుమతించలేదు. అదే విషయం ఇంకా కొనసాగుతోంది. కాని హరిదాసా ఠాకూరా ఎన్నడూ బలవంతంగా ప్రవేశించలేదు. ఆయన తనను తాను అనుకున్నాడు, "అవును, నేను తక్కువ-స్థాయి వ్యక్తిని, తక్కువ-తరగతి కుటుంబంలో జన్మించాను. జగన్నాధునితో ప్రత్యక్షంగా వ్యవహరిస్తున్న పూజారులను మరియు ఇతరులను నేను ఎందుకు భంగపరచాలి? కాదు కాదు." సనాతన గోస్వామి, ఆయన ఆలయ ద్వారం వద్దకు వెళ్ళలేదు. ఆయన తనను తాను అనుకున్నాడు, "నన్ను తాకడం ద్వారా, పూజారులు అపవిత్రం అవుతారు. నేను వెళ్లకపోవడము మంచిది. " కాని జగన్నాథుడు తనను ప్రతిరోజూ చూడటానికి వస్తున్నాడు. ఇది భక్తుడి స్థాయి. భక్తుడు చాలా వినయము కలిగి ఉంటాడు, కాని భక్తుల లక్షణమును నిరూపించడానికి, భగవంతుడు వారి జాగ్రత్తను తీసుకుంటాడు. Kaunteya pratijānīhi na me bhaktaḥ praṇaśyati ( BG 9.31)

కాబట్టి మనము ఎల్లప్పుడూ కృష్ణుడి హామీపై ఆధారపడాలి. ఏ పరిస్థితులలోనూ, ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితిలోనైనా, కృష్ణుడు ... Avaśya rakṣibe kṛṣṇa viśvāsa pālana (Śaraṇāgati). ఇది శరణాగతి. శరణాగతి అంటే ... అంశంలో ఒకటి కృష్ణుడి మీద పూర్తి విశ్వాసము కలిగి ఉండటము, నా భక్తియుక్త సేవని అమలు చేయడములో చాలా ప్రమాదాలు ఉండవచ్చు, కాని నేను కృష్ణుడి కమల పాదాల వద్ద ఆశ్రయం తీసుకున్నాను, నేను సురక్షితంగా ఉన్నాను. " ఇది, కృష్ణుడి మీద విశ్వాసము.

samāśritā ye pada-pallava-plavaṁ
mahat-padaṁ puṇya-yaśo murāreḥ
bhavāmbudhir vatsa-padaṁ paraṁ padaṁ
padaṁ padaṁ yad vipadāṁ na teṣām
(SB 10.14.58)

Padaṁ padaṁ yad vipadāṁ na teṣām. Vipadam అoటే "ప్రమాదకరమైన పరిస్థితి." Padaṁ padam, ఈ భౌతిక ప్రపంచంలోని ప్రతి అడుగు - na teṣām, భక్తుడికి కాదు. Padaṁ padaṁ yad vipadāṁ na teṣām. ఇది శ్రీమద్-భాగవతం. సాహిత్య దృక్కోణం నుండి కూడా చాలా ఉన్నతమైనది. కాబట్టి ప్రహ్లాద మహారాజు ... కవిరాజు గోస్వామి లాగానే. ఆయన చైతన్య-చరితామృతాన్ని రాస్తున్నాడు మరియు తానే చెప్పుతున్నాడు,

purīṣera kīṭa haite muñi se laghiṣṭha
jagāi mādhāi haite muñi se pāpiṣṭha
mora nāma yei laya tāra puṇya kṣaya
(CC Adi 5.205)

ఆ విధముగా చైతన్య-చరితామృత రచయిత, ఆయన తనకు తాను చెప్పుతున్నాడు: మలంలో పురుగు కంటే నీచమైన. Purīṣera kīṭa haite muñi se laghiṣṭha. మరియు చైతన్య-లీలలో, జగాయ్-మాదాయ్, ఇద్దరు సోదరులు చాలా పాపం చేసేవారు. కాని ఆయన, వారిని కూడా రక్షించారు. కవిరాజ గోస్వామి చెప్తూ, "నేను జగాయ్-మాదాయ్ కంటే పాపత్ముడిని

jagāi madhāi haite muñi se pāpiṣṭha
mora nāma yei laya tāra puṇya kṣaya

నేను చాలా అధమ స్థాయిలో ఉన్నాను, ఎవరైనా నా పేరును తలచుకుంటే, చిన్న పుణ్యము ఏమైనా ఉంటే అది కోల్పోతారు ఈ విధముగా ఆయన చెప్పుతున్నాడు. మరియు సనాతన గోస్వామి, తన గురించి తాను చెప్పుతున్నారు, nīca jāti nīca karma nīca saṅga... వారు కృత్రిమంగా లేరు. ఒక వైష్ణవుడు నిజానికి ఆ విధముగా భావిస్తాడు. అది వైష్ణవుడు. ఆయన ఎప్పుడూ గర్వముగా ఉండడు ... మరియు ఎల్లప్పుడు వ్యతిరేకముగా ఉంటాడు నాకు ఇది ఉన్నది . నాకు ఇది ఉన్నది. ఎవరు నాకు సమానము? నేను చాలా ధనవంతుడను. నేను ఇలానే మరియు అలాగే ఉంటాను. "ఇది వ్యత్యాసం.

కనుక మనం నేర్చుకోవాలి tṛṇād api sunīcena taror api sahiṣṇunā మరియు ప్రహ్లాద మహారాజు అడుగుజాడలను అనుసరించాలి. అప్పుడు తప్పనిసరిగా మనల్ని నరసింహ స్వామి, కృష్ణుడు అంగీకరిస్తారు. ఎటువంటి వైఫల్యం లేకుండానే.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద!