TE/Prabhupada 0536 - మీరు కృష్ణుణ్ణి అర్థం చేసుకోకపోతే మీరు వేదాలను అధ్యయనం చేసి ఉపయోగం ఏమిటి



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973


కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో ఉన్నప్పుడు, మీరు చిత్రం చూసి ఉంటారు, ఆయన ఇరవై సంవత్సరాల బాలుడు వలె, లేదా ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు కంటే ఉండదు. కాని ఆ సమయంలో, ఆయనకు మునిమనవళ్ళు ఉన్నారు. అందువలన, కృష్ణుడు ఎల్లప్పుడూ యువకుడు. నవయువ్వనం చ. ఇవి వేద సాహిత్యాల యొక్క వాంగ్మూలాలు.

advaitam acyutam anādiṁ ananta-rūpam
ādyaṁ purāṇa-puruṣaṁ nava-yauvanaṁ ca
vedeṣu durlābhaṁ adurlābhaṁ ātmā-bhaktau
(Bs. 5.33)

కాబట్టి, కృష్ణుడిని అర్ధం చేసుకోవటానికి, మనము వేద సాహిత్యమును లాంఛనముగా చదివినట్లైతే, అప్పుడు కృష్ణుడిని అర్థం చేసుకోవడము చాలా కష్టము అవుతుంది. Vedesu durlābhaṁ. కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి అన్ని వేదాలు ఉన్నప్పటికీ. భగవద్గీతలో, vedaiś ca sarvair aham eva vedyo అంటారు. Aham eva vedyo. మీరు కృష్ణుణ్ణి అర్థం చేసుకోకపోతే మీరు వేదాలను అధ్యయనం చేసి ఉపయోగం ఏమిటి? విద్య యొక్క అంతిమ లక్ష్యం అర్థం చేసుకోవటము, దేవాదిదేవుడు, మహోన్నతమైన తండ్రి, మహోన్నతమైన కారణం. ఇది వేదాంత-సూత్రాలో చెప్పినట్లుగా, janmādy asya yataḥ ( SB 1.1.1) Athāto brahma jijñāsā. Brahma-jijñāsā, మహోన్నతమైన పరమ సత్యము, బ్రహ్మణ్ గురించి చర్చించడానికి. ఆ బ్రహ్మణ్ అంటే ఏమిటి? Janmādy asya yataḥ. ఆ బ్రహ్మణ్ అంటే ఎక్కడి నుండి ప్రతిదీ వస్తుంది. కావున శాస్త్రము, తత్వము అంటే, ప్రతి దాని యొక్క అంతిమ కారణమును కనుగొనటము. కృష్ణుడు అన్ని కారణములకు కారణం అని వేదముల సాహిత్యం నుండి, శాస్త్రము నుండి మనకు తెలుస్తుంది. Sarva-kāraṇa-kāraṇam. Sarva-kāraṇa-kāraṇam.

īśvaraḥ paramaḥ kṛṣṇaḥ
sac-cid-ānanda-vigrahaḥ
anādir ādir govindaḥ
sarva-kāraṇa-kāraṇam
(Bs. 5.1)

అన్ని కారణములకు కారణము. కేవలం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను నా తండ్రి వలన జన్మించాను. నా తండ్రి తన తండ్రి వలన జన్మించారు ఆయన తన తండ్రి వలన, ఆయన తన తండ్రి వలన జన్మించారు ... ఈ విధముగా శోధిస్తూ వెళ్ళండి, అప్పుడు మీరు చివరకు ఎవరైతే కారణమో వారి వద్దకు వస్తారు. కాని ఆయనకి కారణం లేదు. Anādir ādir govindaḥ (Bs. 5.1). నేను నా కుమారుడికి కారణం కావచ్చు, కాని నేను కూడా కారణం యొక్క ఫలితము. నా తండ్రి. కాని శాస్త్రము చెప్పుతున్నది anādir ādir, ఆయన మొదటి వ్యక్తి, కాని ఆయనకి కారణం లేదు. అది కృష్ణుడు. అందువల్ల, కృష్ణుడు చెప్పుతారు, janma karma ca me divyaṁ yo jānāti tattvataḥ ( BG 4.9) కృష్ణుడి ఆగమనం, ఇది చాలా ముఖ్యమైన విషయము. మనము కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఎందుకు ఆయన వస్తారు, ఎందుకు ఆయన ఈ భౌతిక ప్రపంచములోకి వస్తారు, ఆయన పని ఏమిటి, ఆయన కార్యక్రమాలు ఏమిటి. కేవలము మనము కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, అప్పుడు దాని ఫలితమేమిటి? దాని ఫలితం tyaktvā dehaṁ punar janma naiti mām eti kaunteya ( BG 4.9) మీరు ఆ అమరత్వాన్ని పొందుతారు. జీవితం యొక్క లక్ష్యం అమరత్వాన్ని సాధించడం. Amṛtatvāya kalpate.

కాబట్టి కృష్ణుడి ఆగమనంలో, మనము కృష్ణుడి యొక్క తత్వమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఆయన శ్రేష్టమైనవాడు , శాంతిని గురించి చెప్పుతున్నారు. శాంతి సూత్రం ఉన్నది, కృష్ణుడిచే మాట్లాడబడుతుంది. అది ఏమిటి?

bhoktāraṁ yajña-tapasāṁ
sarva-loka-maheśvaram
suhṛdaṁ sarva-bhūtānāṁ
jñātvā māṁ śāntim ṛcchati
(BG 5.29)

రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలు, వారు ప్రపంచములో శాంతిని స్థాపించటానికి ప్రయత్నిస్తున్నారు... యునైటెడ్ నేషన్స్ ఉంది, అనేక ఇతర సంస్థలు ఉన్నాయి. వారు వాస్తవమైన శాంతి ప్రశాంతత కొరకు ప్రయత్నిస్తున్నారు, మానవునికి మానవునికి, దేశానికి దేశానికి మధ్య ఎటువoటి అపార్ధము లేకుండా. కాని అది జరగడములేదు. అది జరగడములేదు. లోపము ఏమిటంటే మూలకారణం తప్పుగా ఉంది. అందరూ ఆలోచిస్తున్నారు "ఇది నా దేశం, ఇది నా కుటుంబం. ఇది నా సమాజం. ఇది నా ఆస్తి. " ఈ "నాది" అనేది భ్రాంతి