TE/Prabhupada 0836 - కాబట్టి మనం ఈ మానవ జీవిత పరిపూర్ణత కోసము దేనినైన త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి



Lecture on CC Madhya-lila 20.100-108 -- New York, November 22, 1966


ఒక సాధు, ఒక సాధువు లేదా భక్తుడు, ఆయనకు ప్రతిదీ తెలిసినా, అయినప్పటికీ, ఆయన ఎప్పుడూ తనను తాను ఉంచుకుంటాడు ఆయనకు ఏమీ తెలియదు అన్నట్లు. నాకు ప్రతిదీ తెలుసు అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ వాస్తవానికి, ప్రతిదాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. కానీ ఒక...ఉదాహరణకు సర్ ఐజాక్ న్యూటన్ లాగా, ఆయన దానిని అంగీకరించారు ప్రజలు నేను చాలా జ్ఞానవంతుడిని అని ప్రజలు చెప్తారు, కానీ నాకు తెలియదు నేను ఎంత జ్ఞానవంతుడినో నేను కేవలము సముద్ర తీరంలో కొన్ని గులకరాళ్ళను సేకరిస్తున్నాను. "కావున అది పరిస్థితి వాస్తవానికి జ్ఞానవంతుడైన వ్యక్తి, "నేను జ్ఞానవంతుడిని" అని ఎన్నడూ చెప్పడు. ఆయన చెప్తాడు కేవలము "నేను మూర్ఖులలో మొదటి వాడిని, నాకు తెలియదు".

కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన వినమ్రతను మెచ్చుకున్నారు, వాస్తవానికి ఆయన సమాజంలో చాలా జ్ఞానము కలిగిన వ్యక్తి. కాబట్టి పరస్పరము ఒకరిని ఒకరు అభినందించుకునే విధముగా, మార్పిడి, నేను చెప్పేది ఏమిటంటే, మర్యాద, ఆయన కూడా అంగీకరించారు, "కాదు, మీరు పతనము కాలేదు, మీరు నిరుత్సాహపడవద్దు. సరళముగా ఇది జ్ఞానము ఉన్న వ్యక్తి యొక్క కర్తవ్యము అలా తనను తాను ఉంచుకోవడము. కానీ మీరు అవివేకి కాదు. Kṛṣṇa śakti dhara tumi: (CC Madhya 20.105 మీరు ఇప్పటికే భక్తులు కనుక." పదవీ విరమణ ముందు, చైతన్య మహా ప్రభు ముందుకు వచ్చేటప్పుడు ఈ గోస్వాములు, నేను చెప్పినట్లు, వారు చాలా జ్ఞానము కలిగిన సంస్కృత పండితులు. వారు భాగవతము చదివేవారు. ఆయన నవాబ్ షాకు తప్పుడు నివేదిక ఇచ్చినప్పుడు, "నాకు ఆరోగ్యము సరిగ్గా లేదు నేను కార్యాలయమునకు హాజరు కాలేను. నవాబ్ షా వ్యక్తిగతంగా ఒక రోజు ఆయన ఇంటికి వెళ్ళాడు, ఈ పెద్ద మనిషి కార్యాలయమునకు హాజరు కావడం లేదు. కేవలము అనారోగ్య నివేదికను సమర్పిస్తున్నాడు. అది ఏమిటి? కావున ఆయన సమీపిస్తున్నప్పుడు, నవాబ్ షా చూసినాడు ఆయన జ్ఞానము కలిగిన పండితులతో శ్రీమద్-భాగవతం చదువుతున్నారు అప్పుడు ఆయన అర్థము చేసుకున్నాడు "ఓ, ఇదా మీ వ్యాధి, మీరు ఇప్పుడు శ్రీమద్-భాగవతమును తీసుకున్నారు" . వాస్తవానికి ఆయన చాలా జ్ఞానము కలిగిన వారు, కానీ తన వినయ ప్రవర్తన వలన, ఆయన ఈ సున్నితమైన మార్గంలో భగవంతుడు చైతన్యకు తనను తాను సమర్పిస్తున్నాడు.

కాబట్టి చైతన్య మహా ప్రభు చెప్పారు,

sad-dharmasyāvabodhāya
yeṣāṁ nirbandhinī matiḥ
acirād eva sarvārthaḥ
sidhyaty eṣām abhīpsitaḥ
(CC Madhya 24.170)

ఆయన "నీ కోరిక పరిపూర్ణత పొందడము, అందువల్ల నీవు చాలా వినమ్రతతో ఉన్నావు" అని చెప్పాడు. అందువల్ల ఆయన నారదీయ పురాణము నుండి ఒక శ్లోకమును చెప్పినారు, ఎవరైతే చాలా తీవ్రమైన వ్యక్తో... సంపూర్ణంగా తనను తాను తెలుసుకోవటంలో తీవ్రముగా ఉన్నవాడు, ఆయన ఆ విధముగా ప్రయత్నిస్తే, అప్పుడు ఆయన పరిపూర్ణత హామీ ఇవ్వబడుతుంది. ఒకటే విషయము ఆయన చాలా తీవ్రముగా ఉండాలి. ఈ భాష్యము శ్లోకము యొక్క భాష్యము, sad-dharmasyāvabodhāya yeṣāṁ nirbandhinī matiḥ. Nirbandhinī matiḥ అంటే "ఈ జీవితంలో నేను నా జీవితాన్ని పరిపూర్ణంగా చేస్తాను" అని ఇప్పటికే నిర్ణయించాడని అర్థం. అప్పుడు, ఆయనకి పరిపూర్ణత హామీ ఇవ్వబడుతుంది. హామీ ఇవ్వబడుతుంది. ఆయన అనుకున్నట్లయితే, "నేను ప్రయత్నిస్తాను కృష్ణ చైతన్యము యొక్క ఈ విభాగాన్ని కూడా పరీక్షిద్దాం, అదే సమయంలో ఇతర విభాగాలను కూడా పరీక్షిద్దాము. మనము ఈ విధముగా వెళ్దాం... " లేదు. ఈ జీవితమును పూర్తిగా పరిపూర్ణము చేసుకోవడానికి ఒకరు చాలా తీవ్రముగా ఉండాలి. కాబట్టి ఒక మనిషి సనాతన గోస్వామి వలె తీవ్రముగా ఉండాలి. ఆ ప్రయోజనము కోసము ఆయన అంతా త్యాగము చేశాడు, ఆయన ఒక యాచించేవాడు అయ్యాడు. కాబట్టి మనం ఈ మానవ జీవిత పరిపూర్ణత కోసము దేనినైన త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు పరిపూర్ణత హామీ ఇవ్వబడుతుంది. కేవలం మనము చాలా తీవ్రమై ఉండాలి, అంతే.