TE/Prabhupada 0750 - ఎందుకు తల్లికి మన గౌరవాన్ని ఇస్తున్నాము



Lecture on BG 9.10 -- Melbourne, April 26, 1976


mṛtyu-saṁsāra-vartmani అంటే ఏమిటో పరిశోధన చేయటానికి ఏ పాఠశాల, కళాశాల లేదా సంస్థ లేదు. మనము ఎంత పతనమైపోయాము అంటే మనము విచారణ చేయడంలేదు . ఉదాహరణకు అదే, జంతువులాగా. జంతువు కబేళానికి తీసుకువెళ్లబడుతుంది, అందరికీ తెలుసు. కానీ ఆ జంతువుకు విచారించడానికి ఎలాంటి సామర్థ్యమూ లేదు, "నేను ఎందుకు కబేళాకి తీసుకువెళ్లబడుతున్నాను?" దానికి ఏ సామర్థ్యమూ లేదు. ఏ విధమైన ప్రతిఘటన చేయటానికి ఆయనకు ఎటువంటి సామర్థ్యం లేదు ఆ కబేళానికి తీసుకువెళ్ళబడటానికి వ్యతిరేకంగా. Mṛtyu-saṁsāra-vartmani. మనలో ప్రతి ఒక్కరమూ, మనము కబేళాకు వెళుతున్నాం; కానీ మానవుడు, అతనిని బలవంతంగా అతనిని కబేళా తీసుకువెళ్ళితే, ఆయన కనీసం కొంత నిరసన వ్యక్తం చేస్తాడు, ఏడుస్తాడు "ఎందుకు ఈ మనిషి నన్ను కబేళానికి తీసుకువెళుతున్నాడు?" కానీ జంతువుకు లేదు... దానికి అనిపిస్తున్నప్పటికీ, అది ఏడుస్తుంది, కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు మనము చూస్తాము. వాటికి తెలుసు "మనము ఏ తప్పు చేయకున్నా కబేళాకు తీసుకువెళ్లబడుతున్నాము. మనము ఏ హాని చేయడం లేదు. " ఉదాహరణకు ఆవులు. అవి గడ్డి తిని, బదులుగా మీకు చాలా పోషకమైన ఆహారం ఇస్తున్నాయి, పాలను ఇస్తున్నాయి. కానీ మనము చాలా క్రూరమైన వారము కాబట్టి కృతజ్ఞత లేని మనము కబేళాకు ఆవులను తీసుకుని వెళ్తున్నాము.

వేదముల నాగరికత ప్రకారం, ఆవును తల్లిగా భావిస్తారు. ఎందుకు తల్లి కాదు ? ఆమె పాలు సరఫరా చేస్తోంది. ఎందుకు తల్లి గౌరవనీయమైనది? ఎందుకు తల్లికి మన గౌరవాన్ని ఇస్తున్నాము? ఎందుకంటే మీరు నిస్సహాయంగా ఉన్నప్పుడు, మనము ఏదైనా తినలేము, తల్లి రొమ్ము నుండి పాలు సరఫరా చేస్తుంది. తల్లి అంటే ఆహారాన్ని సరఫరా చేసేది. కనుక ఆవు ఆహారాన్ని సరఫరా చేస్తుంటే, పాలను - పాలు చాలా పోషక కరమైనవి మరియు పూర్తి విటమిన్ పదార్థం కలిగినవి - ఆమె మన తల్లి. వేదముల నాగరికత ప్రకారం శాస్త్రంలో ఏడుగురు తల్లులు ఉన్నారు. ఏడుగురు తల్లులు. ఒక తల్లి వాస్తవమైన తల్లి, ఎవరి గర్భం నుండి మనము జన్మించామో. Ādau mātā. ఆమె వాస్తవమైన తల్లి. గురు- పత్ని , ఆధ్యాత్మిక గురువు లేదా గురువు భార్య, ఆమె తల్లి. Ādau mātā గురు- పత్ని బ్రాహ్మణి. ఒక బ్రాహ్మణ భార్య, ఆమె కూడా తల్లి. నిజానికి, ఒక నాగరిక మనిషి తన సొంత భార్యను తప్ప అందరు స్త్రీలను తల్లిగానే చూస్తాడు. ఏడు, ఎనిమిది కాదు. ప్రతి ఒక్కరిని.

mātṛvat para-dāreṣu
para-dravyeṣu loṣṭravat
(Cāṇakya-śloka 10)

జ్ఞానవంతులైన విద్వాంసుడు అంటే ఆయన ఎన్ని డిగ్రీలను కలిగి ఉన్నాడు అని కాదు. జ్ఞానము కలిగినవారు అంటే ఎవరు మహిళలందరినీ తల్లిగా చూస్తారో వారు అని అర్థం. కాబట్టి అందరు మహిళలు, కాకుంటే, కనీసం మనము ఏడుగురుని తల్లిగా అంగీకరించాలి. Ādau mātā గురు- పత్ని బ్రాహ్మణి. బ్రాహ్మణి. రాజ- పత్నికా , రాణి. రాణి తల్లి, రాజ-పత్నికా. ధేను, ఆవు. ఆవు తల్లి. మరియు ధాత్రి, నర్స్, ఆమె తల్లి. ధేనుర్ ధాత్రి తథా పృథ్వి. భూమి, ఆమె మనకు చాలా రకాల ఆహారం ఇస్తోంది.

కాబట్టి ఇది తత్వము. కాబట్టి మనము చాలా దయను కలిగి ఉండాలి, కనీసం ఆవులపైన. ఒకరు మాంసం తినడానికి బానిస అయినట్లయితే, అతను కొన్ని ఇతర చిన్న జంతువులను చంపవచ్చు గొర్రెలు, మేకలు,పందులు, చేపలు వంటివి. ఇతర జంతువులు ఉన్నాయి. కానీ భగవద్గీతలో ముఖ్యంగా ఇది ప్రస్తావించబడింది,

kṛṣi-go-rakṣya-vāṇijyaṁ
vaiśya-karma svabhāva-jam
(BG 18.44)

గో-రక్ష. ఇది సమాజంలో చాలా ముఖ్యమైన విషయం , ఆవులకు రక్షణ ఇవ్వడం మరియు పాలను పొందడం. పాలతో రకరకాలు తయారీ చేయవచ్చు, చివరికి నెయ్యి చాలా ముఖ్యమైన విషయం. భారతదేశంలో ఇప్పటికీ ప్రతి ఇంటికి తగినంత నెయ్యి అవసరమవుతుంది. కానీ వారు మాంసం తినేవారు కాదు. మాంసం తినేవారు నెయ్యిని సహించరు